తెలంగాణలో మరో మంత్రికి కరోనా
ABN , First Publish Date - 2021-05-09T18:09:32+05:30 IST
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సా
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇటీవల చాలమంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. గత రెండురోజులుగా అస్వస్థతగా ఉండడంతో ఆయన కోవిడ్19 పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు. కాగా గత కొన్ని రోజుల నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.