TS News: మునుగోడు నేతలతో రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ
ABN , First Publish Date - 2022-09-11T19:36:58+05:30 IST
మునుగోడు కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు.
హైదరాబాద్ (Hyderabad): మునుగోడు కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. మునుగోడు టిక్కెట్ ఆశించిన నేతలను స్వయంగా తన నివాసానికి రేవంత్ ఆహ్వానించారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు ఆశావహులు చెలమల కృష్ణా రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపిక విషయంలో తీసుకున్న ప్రమాణాలు, పార్టీ ప్రస్తుత పరిస్థితిని నేతలకు వివరించారు. ఆశపడి, భంగపడిన వారికి నచ్చజెప్పి.. పార్టీ కోసం పని చేయాలని కోరారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో... వారికి కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.