300 ఎకరాల్లో నీకు ఫ్రీ కరెంటా కేసీఆర్?: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-08-16T00:45:57+05:30 IST
కేసీఆర్కు మందు మీదున్న ప్రేమ మంది మీద ఉండదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనగామ: కేసీఆర్కు మందు మీదున్న ప్రేమ మంది మీద ఉండదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇళ్లు ఇస్తే, కేసీఆర్ ఎందుకు పంపిణీ చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలోని దేవరుప్పల మండలం ధర్మాపురంలో ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. కంపచెట్లు మొలవడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు అధ్వాన్నంగా మారుతున్నాయని చెప్పారు. కొనుగోలు, బెదిరింపులతో స్థానిక నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. ‘‘300 ఎకరాల్లో నీకు ఫ్రీ కరెంటా కేసీఆర్?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతులు, ఉద్యోగులు, యువతను కేసీఆర్ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.