ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-08-09T02:08:35+05:30 IST

ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: బండి సంజయ్

ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: బండి సంజయ్

యాదాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నిక ప్రతి సర్వే‌లో బీజేపీదే గెలుపని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడు నియోజక వర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని సూచించారు. మిషన్ భగీరథ నీళ్ళు ప్రతి ఇంటికి  రావడం లేదన్నారు. నీతి అయోగ్‌కి పిలిస్తే మన సీఎం కేసీఆర్ నేను పోను అని అంటున్నాడని, అంటే దొంగ ఎవరి మీరే చెప్పాలన్నారు. రాష్ట్రం లో ప్రతి సమస్య పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ లబ్ది కోసం గట్టుపల్ మండలం ప్రకటించారని అన్నారు. లక్కారం, చౌటుప్పల్ పెద్ద చెరువులు నిండితే చౌటుప్పల్ మునిగి పోతధి కానీ 3 సంవత్సరాల నుండి దీనికి ప్రత్యాయంగా పనులు చేయని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. మునుగోడు నియోజక వర్గం నుండి ప్రతి మండలానికి కలిపే రోడ్లను ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా ఇచ్చిన నిధులే అని తెలిపారు. 

Updated Date - 2022-08-09T02:08:35+05:30 IST