ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-28T21:57:52+05:30 IST

నగరంలోని చితలబస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ MPCలో తక్కువ మార్కులతో పాస్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని చింతలబస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ MPCలో తక్కువ మార్కులతో పాస్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతలబస్తికి చెందిన విద్యార్థి గౌతం కుమార్ (18) ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు మొదటగా గౌతమ్‌ను స్థానిక మహావీర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందడంతో కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు. 

Updated Date - 2022-06-28T21:57:52+05:30 IST