విషాదం... చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2022-06-28T02:52:09+05:30 IST

విషాదం... చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

విషాదం... చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూసాల చెరువులో పడి ఇద్దరు చిన్నారు మృతి చెందారు. మృతులు శాన్వి(6), అనుశ్రీ(3)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధులు బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-06-28T02:52:09+05:30 IST