వీఆర్ఏల ఆందోళనపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్
ABN , First Publish Date - 2022-10-08T01:32:11+05:30 IST
వీఆర్ఏల ఆందోళనపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్
హైదరాబాద్: వీఆర్ఏల ఆందోళనపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. వీఆర్ఏలు 75 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం దున్నపోతుపై వానపడినట్టుగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినవారిపై పేపర్లు విసిరికొట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. వీఆర్ఏల డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.