ఎబీయన్ ప్రత్యేక కథనాలపై ప్రభుత్వం స్పందన
ABN , First Publish Date - 2022-05-19T20:54:23+05:30 IST
ఎబీయన్ ప్రత్యేక కథనాలపై ప్రభుత్వం స్పందన
అమరావతి: టామాట, ఇతర కూరగాయల ధరలపై ఎబీయన్ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. రైతు బజార్లలో అర్ధసెంచరీ దాటిన కిలో టామోటాపై వినియోగదారులతో లైవ్ కవరేజీ ఏబీయన్ కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ నెల 20 నుండి రైతు బజార్లలో సరసమైన ధరలకు టమాటా విక్రయాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి చెప్పారు. ప్రజలకు సరసమైన ధరలకే టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల నుండి టమాటా దిగుమతి అవుతుందన్నారు. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. బహిరంగ మార్కెట్లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను కొనుగోలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లోని అన్ని రైతు బజార్ల ద్వారా సరసమైన ధరలకే టమాటాలను విక్రయిస్తామన్నారు.