సీబీఐ డైరెక్టర్కు వైఎస్ షర్మిల ఫిర్యాదు.. ఆ ఫిర్యాదులు ఏంటంటే...
ABN , First Publish Date - 2022-10-07T23:13:32+05:30 IST
సీబీఐ డైరెక్టర్కు వైఎస్ షర్మిల ఫిర్యాదు.. ఆ ఫిర్యాదులు ఏంటంటే...
ఢిల్లీ: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేశామని వైఎస్ షర్మిల వెల్లడించారు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలన్నారు. కేసీఆర్ BRS పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?, కాళేశ్వరం అవినీతిపై రేవంత్, సంజయ్ ఎందుకు నోరు మెదపడం లేదు?, కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంగా మారిందన్న కేంద్రమంత్రులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.