Telanganaలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు...హాట్స్పాట్గా హైదరాబాద్
ABN , First Publish Date - 2021-12-23T17:00:17+05:30 IST
రాష్ట్రాన్ని ఒమైక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. రోజురోజుకూ ఒమైక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమైక్రాన్ కేసుల నమోదు అయ్యాయి.
హైదరాబాద్: రాష్ట్రాన్ని ఒమైక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. రోజురోజుకూ ఒమైక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమైక్రాన్ కేసుల నమోదు అయ్యాయి. అటు దేశ వ్యాప్తంగా 270 వరకు వైరస్ బారిన పడ్డారు. ఒమైక్రాన్ కేసులలో తెలంగాణ నాల్గవ స్థానంలో నిలిచింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు విదేశీ రాకపోకలు ఎక్కువగా ఉండటమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 14 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ బాధితుల్లో 6 రిస్క్ దేశాల నుంచి, 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి రాగా... మరొకరు కాంటాక్ట్ వ్యక్తి వైరస్ సోకింది. కాంటాక్ట్ వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. వచ్చిన కేసులు ఎక్కువగా టోలిచౌకి, పారామౌంట్ నుంచే ఉన్నారు. ఒమైక్రాన్కు హైదరాబాద్ హాట్ స్పాట్గా నిలుస్తోంది. అటు జిల్లాలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమైక్రాన్ విషయంలో ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఒమైక్రాన్ కేసులు వచ్చిన ఇళ్లలో శాంపిల్స్ తీసుకుని లైట్ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. వ్యాప్తి ఎక్కువయినా కట్టడి చర్యలు నిల్గా ఉన్నాయి.