తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలలా మారారు: షర్మిల
ABN , First Publish Date - 2022-04-26T22:43:06+05:30 IST
తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలలా మారారు: షర్మిల
హైదరాబాద్: తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలలా మారారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. భద్రాచలంలో మీటింగ్ పెడితే రూల్స్ అతిక్రమించామని కేసులు పెట్టారని ఆమె మండిపడ్డారు. కేసులు పెట్టాల్సింది తమపై కాదని.. కేసీఆర్పై కేసులు పెట్టాలని షర్మిల అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. రుణమాఫి చేయనందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.