Telanganaలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా?: రఘునందన్‌రావు

ABN , First Publish Date - 2022-06-17T22:29:53+05:30 IST

తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా? అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

Telanganaలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా?: రఘునందన్‌రావు

హైదరాబాద్: తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా? అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి చేశారని ఆరోపించారు. అభ్యర్థుల ముసుగులో ఎంఐఎం, టీఆర్ఎస్‌, కాంగ్రెస్ గూండాలు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఘటనపై సీఎం కేసీఆర్, హోమ్‌ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై చర్చకు సిద్ధం.. ట్విటర్ పక్షి వస్తారా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Updated Date - 2022-06-17T22:29:53+05:30 IST