తెలంగాణ మీదుగా భారత్ జోడో యాత్ర: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-15T01:02:59+05:30 IST

తెలంగాణ మీదుగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

తెలంగాణ మీదుగా భారత్ జోడో యాత్ర: రేవంత్‌రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ మీదుగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముక్తల్ నుంచి నాందేడ్ మీదుగా యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, సమస్యలపై ప్రజలను.. చైతన్యం చేసేందుకే రాహల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సమీక్షలు రాజకీయ అంశాలపై తప్ప ప్రజాసమస్యలపై కాదని తప్పుబట్టారు. కేసీఆర్ నిద్రమత్తు వదిలి వరద సహాయ చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పంట నష్టం అంచనా వేసి కేంద్రానికి లేఖ రాయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీట మునిగింది.. 2-3 ఏళ్లు నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదని తెలిపారు. 17 నుంచి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ సహాయక బృందాల పర్యటిస్తాయని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2022-07-15T01:02:59+05:30 IST