అన్ని పోలీస్ స్టేషన్లకు ‘పునాస’ సాహిత్యపత్రిక

ABN , First Publish Date - 2022-04-19T00:36:14+05:30 IST

తెలంగాణ సాహిత్య అకాడమీ నెల నెలా వెలువరిస్తున్న ‘పునాస’ పత్రికను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని సాహిత్యఅకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్ని పోలీస్ స్టేషన్లకు ‘పునాస’ సాహిత్యపత్రిక

హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ నెల నెలా వెలువరిస్తున్న ‘పునాస’ పత్రికను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని సాహిత్యఅకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఆయన డీజీపీ కార్యాలయంలో మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సాహిత్య, సాంస్క`తిక రంగాలలో వచ్చిన మార్పులు, పాఠశాల విద్యలో ప్రధానంగా తెలుగు పాఠ్యాంశాల్లో వచ్చిన మార్పులపై ఆయన చర్చించారు.


సాహిత్యకారుల గురించి పాఠ్యాంశాలలో చేర్చటం ద్వారా ఈ తరం విద్యార్ధులకు తెలంగాణ అస్తిత్వం అర్ధమవుతుందని డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరిస్తున్న సాహిత్య పత్రిక ‘పునాస’ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేందుకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు కోరారు. తెలంగాణ సాహిత్య సాంస్క`తిక అస్తిత్వానికి ప్రతీకగా ‘పునాస’ వెలువడుతుందని తెలిపారు.

Updated Date - 2022-04-19T00:36:14+05:30 IST