హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బక్కని

ABN , First Publish Date - 2021-07-25T08:04:58+05:30 IST

దళితుల అభ్యున్నతికి సంబంధించి 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింలు సీఎం కేసీఆర్‌ను...

హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బక్కని

హైదరాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): దళితుల అభ్యున్నతికి సంబంధించి 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింలు సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎంకు ఒక బహిరంగ లేఖ రాశారు.  ప్రజాసమస్యల పరిష్కారం కోసం సర్వాయి పాపన్నలా ధైర్యంగా పోరాటాలు చేయాలని ఎన్టీఆర్‌భవన్‌లో జరిగిన  తెలుగునాడు గీత కార్మిక సంఘం సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే, వారు ఉత్పత్తిచేసే వస్త్రాల ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే, టీటీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-07-25T08:04:58+05:30 IST