తెలంగాణలో మద్యం ప్రియులకు శుభవార్త
ABN , First Publish Date - 2021-12-29T02:39:31+05:30 IST
తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల వేళల్లో మార్పు చేసింది. ఈ నెల 31న...
హైదరాబాద్: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల వేళల్లో మార్పు చేసింది. ఈ నెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. అదే రోజు అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేకంగా అనుమతిచ్చింది. ఈవెంట్ల నిర్వహణకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈవెంట్లలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి లైసెన్సుకు రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్శాఖ పేర్కొంది.