దీపావళి నాటికి టెలికాం చార్జీలు మరింత ప్రియం!Telecom charges more dear by Diwali!

ABN , First Publish Date - 2022-05-26T10:09:18+05:30 IST

ఈ దీపావళి నాటికి టెలికాం సేవలు మరింత ప్రియం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీపావళి నాటికి టెలికాం చార్జీలు మరింత ప్రియం!Telecom charges more dear by Diwali!

ప్రైవేట్‌ టెల్కోల టారి్‌ఫలు 10-12ు పెరిగే అవకాశం 

న్యూఢిల్లీ: ఈ దీపావళి నాటికి టెలికాం సేవలు మరింత ప్రియం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేట్‌ రంగ టెలికాం సేవల కంపెనీలైన ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా తమ ప్రీపెయిడ్‌ సేవల చార్జీలను ఈ నవంబరుకల్లా 10-12 శాతం మేర పెంచవచ్చని అంచనా. దీంతో ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఆర్పు) ఎయిర్‌టెల్‌ రూ.200కు, జియో రూ.185కు, వొడాఐడియా రూ.135కు పెంచుకోవచ్చని అమెరికాకు చెందిన ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ విలియమ్‌ ఓ నీల్‌ అండ్‌ కో భారత విభాగ ప్రతినిధి మయురేశ్‌ జోషి పేర్కొన్నారు. గత ఏడాది నవంబరులోనే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రీ-పెయిడ్‌ ప్లాన్‌ చార్జీలను 20-25 శాతం మేర పెంచాయి. దాంతో, రిలయన్స్‌ జియో సైతం గత డిసెంబరులో రేట్లు పెంచింది. 


Updated Date - 2022-05-26T10:09:18+05:30 IST