అభివృద్ధి పనులు వివరిస్తూ ఓట్లు అడగండి

ABN , First Publish Date - 2021-02-26T05:53:43+05:30 IST

అద్దంకి పట్టణంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధిపనులు వివరిస్తూ ఓట్లు అడగాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆయా వార్డుల నాయకులకు సూచించారు.

అభివృద్ధి పనులు వివరిస్తూ ఓట్లు అడగండి
నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌




ఎమ్మెల్యే రవికుమార్‌


అద్దంకి, ఫిబ్రవరి 25: అద్దంకి పట్టణంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధిపనులు వివరిస్తూ ఓట్లు  అడగాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆయా వార్డుల నాయకులకు సూచించారు. అ ద్దంకి నగరపంచాయతీ ఎన్నికల నేపథ్యం లో గురువారం స్థానిక  టీడీపీ కార్యాలయంలో ఆయా వార్డుల నాయకులు,  అ భ్యర్థులతో చర్చించారు.  ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడగటంతో పాటు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ఇంటి పన్ను పెంపు తదితర అంశాలను వివరించాలన్నారు. ప్రత్యర్థుల ప్రలోభాలను దీటుగా ఎదుర్కోవాల ని ఆయన చెప్పారు. చిన్నపాటి సమస్య తలెత్తినా తనదృష్టికి తీసుకురావాలని సూ చించారు. ప్రత్యేకం గా ఎస్సీకాలనీలలో పోటీచేసిన అభ్యర్థులతో చర్చించారు. ఈ సమావేశాలలో సందిరెడ్డి శ్రీనివాసరావు, ఎంజే స్టాలిన్‌, కాంతయ్య, కొండ మ్మ, రామాంజనే యులు, నాగరాజు, చుండూరి మురళీసుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నివాళి : నాగులపాడులో మాజీ సర్పంచ్‌ కరి శివానందబాబు సతీమణి రాధ బుధవారం రాత్రి మృతిచెందగా గురువారం ఉదయం ఎమ్మెల్యే రవికుమార్‌ నివాళులర్పించారు. కుటుంబసభ్యులను  పరామర్శించారు. క రి  పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:53:43+05:30 IST