ఓటమి బాధ.. అప్పుల భారం

ABN , First Publish Date - 2021-03-07T07:05:39+05:30 IST

ఎన్నికల్లో ఓటమిని భరించలేక, తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కన్పించక తెల్లబాడు-దొడ్డవరం వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థి శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఓటమి బాధ.. అప్పుల భారం

తెల్లబాడు సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మాహత్యాయత్నం 

మద్దిపాడు, మార్చి 6 : ఎన్నికల్లో ఓటమిని భరించలేక, తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కన్పించక తెల్లబాడు-దొడ్డవరం వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థి శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసీపీ మద్దతుదారుగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన జడా సురేంద్రబాబు పోటీ చేశారు. ఆయనపై తెలుగుదేశం మద్దతు అభ్యర్థి పూనూరి సుబ్బారావు 75 ఓట్లతో గెలిచి సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నారు. ఎన్నికల కోసం సురేంద్ర దాదాపు రూ.23లక్షలు ఖర్చు పెట్టారు. అంతా అప్పులే తెచ్చినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత నుంచి అతను మానసికంగా కుంగిపోయాడు. దాని నుంచి బయటపడలేక, తీవ్ర మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంట్లోనే పురుగుమందు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో తరలించారు. సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మద్దిపాడు ఎస్సై ఫాతిమా కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.

Updated Date - 2021-03-07T07:05:39+05:30 IST