TAGS ఆధ్వర్యంలో ప్రవాసులకు రచన పోటీలు..

ABN , First Publish Date - 2021-10-28T17:42:07+05:30 IST

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (టీఏజీఎస్) ఆధ్యర్యంలో యూఏఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీలు జరగనున్నాయి.

TAGS ఆధ్వర్యంలో ప్రవాసులకు రచన పోటీలు..

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (టీఏజీఎస్) ఆధ్యర్యంలో యూఏఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన నియమనిబంధనలను తాజాగా నిర్వాహకులు వెల్లడించారు. విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులని తెలియజేశారు. ప్రవాసులు తమ రచనలను telugusac@yahoo.comకు ఈ-మెయిల్ చేయాలి. రచనలు పంపించడానికి ఆఖరి తేదీ: నవంబర్ 30, 2021. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా 116 డాలర్లు, ద్వితీయ బహుమతి 58 డాలర్లు, తృతీయ బహుమతిగా 28 డాలర్లు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.


షరతులు: 

* ఒక్కో విభాగానికి ఒక్క రచన మాత్రమే పంపాలి.

* రచనలు తెలుగులో మాత్రమే ఉండాలి.

* ఇండియా మినహా అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సింగపూర్, మలేసియా, తదితర దేశాలలో నివసిస్తున్న ప్రవాసులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. 

ఇతర వివరాల కోసం http://tinyurl.com/tagscontest లో చూడొచ్చు. 








Updated Date - 2021-10-28T17:42:07+05:30 IST