న్యూజిలాండ్‌ ఎంపీగా తెలుగమ్మాయి..!

ABN , First Publish Date - 2022-01-16T15:29:44+05:30 IST

న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయి గడ్డం మేఘన(18)కు అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికయ్యారు. తాజాగా ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా 'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌...

న్యూజిలాండ్‌ ఎంపీగా తెలుగమ్మాయి..!

ఎన్నారై డెస్క్: న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయి గడ్డం మేఘన(18)కు అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికయ్యారు. తాజాగా ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా 'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘన ఎన్నికయ్యారు. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్ పదవీకి ఎంపికయ్యారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోనే స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అలా 21 ఏళ్ల క్రితం భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లిన రవికుమార్ అక్కడే స్థిరపడిపోయారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హై స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. 


ఇక స్కూల్ డేస్ నుంచే మేఘన చారిటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. అలాగే ఆ దేశానికి వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, ఆశ్రయం, కనీస వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెను పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్‌ 16న జరిగిన ఈ ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్‌ నాన్‌ డిమోలెన్‌ తాజాగా మేఘన ఫ్యామిలీకి తెలియజేశారు. ఫిబ్రవరిలో మేఘన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

Updated Date - 2022-01-16T15:29:44+05:30 IST