తెలుగు భాషను కాపాడాలి
ABN , First Publish Date - 2022-08-18T05:17:20+05:30 IST
తెలుగుభాషను కాపాడాలని పట్టణానికి చెందిన శ్రీనివాస్ బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వందేమాతరం ఉద్య మం పేరుతో రిలే దీక్ష చేపట్టారు.
కదిరి అర్బన, ఆగస్టు 17: తెలుగుభాషను కాపాడాలని పట్టణానికి చెందిన శ్రీనివాస్ బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వందేమాతరం ఉద్య మం పేరుతో రిలే దీక్ష చేపట్టారు. తెలుగు మాధ్యమాన్ని పాఠశాలలు, ఉన్న విద్యాసంస్థల్లో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో దసా్త్రలు, పత్రాలన్నీ తెలుగులోనే ఉండాలని అన్నారు. మాతృభాష పరిరక్షణతోనే జాతి మనుగడ సాధ్యమవుతుందని మేధావులు చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.