మహిళలు, చిన్నారులపై..దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2020-11-29T04:33:08+05:30 IST
చిన్నారులు, మహిళలపై దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షు రాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు.
పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వనజాక్షిa
నెల్లిమర్ల, నవంబరు 28: చిన్నారులు, మహిళలపై దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షు రాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు. శనివారం ఆమె స్థానిక విలేఖర్లతో మా ట్లాడారు. రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. భోగాపురం మండలంలో చిన్నారిపై అఘాయి త్యం జరిగి మూడు రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబసభ్యులకు నాయకులు, అధికారులు కనీసం పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ? లేదా ? అన్న అనుమానం కలుగుతోందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు.