అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలుగు ఎన్నారై అసోసియేషన్

ABN , First Publish Date - 2020-07-07T04:35:44+05:30 IST

అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో తెలుగు ఎన్నారై అసోషియేషన్

అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలుగు ఎన్నారై అసోసియేషన్

మిన్నియాపాలిస్: అమెరికాలోని తెలుగు ఎన్నారై అసోషియేషన్ అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఎన్నారైలు మిన్నియాపాలిస్ నగరంలో ప్లకార్డులు చేతపట్టి జై అమరావతి.. ఆంధ్రులంతా ఒక్కటే.. ఆంధ్రుల రాజధాని ఒక్కటే.. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు ఎన్నారై అసోషియేషన్ సభ్యులు ప్రదీప్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని.. మూడు రాజధానుల వల్ల  ప్రభుత్వానికి ఖర్చు తప్ప ప్రజలకు ప్రయోజనం శూన్యమన్నారు. ఒక రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 200 రోజులకు పైగా అలుపెరగక అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు అభినందనలు తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తాము అండగా ఉంటామన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అమరావతి  ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని ప్రదీప్ తెలిపారు.

Updated Date - 2020-07-07T04:35:44+05:30 IST