America లో పారాచూట్‌ ప్రమాదం.. తెలుగు NRI మహిళ దుర్మరణం!

ABN , First Publish Date - 2022-06-01T13:06:00+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడాలో పారాచూట్‌ ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ అలపర్తి సుప్రజ(34) దుర్మరణం పాలయ్యారు. ఆమె కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. సుప్రజ స్వగ్రామం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం. ఆమె భర్త అలపర్తి వాసుబాబుది..

America లో పారాచూట్‌ ప్రమాదం.. తెలుగు NRI మహిళ దుర్మరణం!

బాపట్ల జిల్లా వాసి దుర్మరణం

కుమారుడికి స్వల్ప గాయాలు

యద్దనపూడి (మార్టూరు), మే 31: అమెరికాలోని ఫ్లోరిడాలో పారాచూట్‌ ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ అలపర్తి సుప్రజ(34) దుర్మరణం పాలయ్యారు. ఆమె కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. సుప్రజ స్వగ్రామం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం. ఆమె భర్త అలపర్తి వాసుబాబుది యద్దనపూడి మండలం చింతపల్లిపాడు గ్రామం. వారిద్దరికీ 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన వాసుబాబు.. భార్య, పిల్లలతో కొన్నేళ్లుగా అమెరికాలోని చికాగోలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వాసుబాబు కుటుంబం ఫ్లోరిడాకు విహారయాత్రకు వెళ్లింది. అక్కడ పారాచూట్‌లో ఎగురుతుండగా ఒక్కసారిగా విపరీతమైన గాలి వీయడంతో పారాచూట్‌ అదుపుతప్పింది. గాలిలో ఉండగానే అది బ్రిడ్జి గోడకు తగలడంతో సుప్రజ తీవ్రంగా గాయపడి మృతిచెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - 2022-06-01T13:06:00+05:30 IST