London: వైభవంగా NTR శత జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-31T13:29:01+05:30 IST

తెలుగు జాతి ఖ్యాతిని విశ్వావ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను లండన్‌లో తెలుగు ఎన్నారైలు వైభవంగా నిర్వహించారు.

London: వైభవంగా NTR శత జయంతి ఉత్సవాలు

లండన్: తెలుగు జాతి ఖ్యాతిని విశ్వావ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను లండన్‌లో తెలుగు ఎన్నారైలు వైభవంగా నిర్వహించారు. ఈస్ట్ లండన్ నగరంలోని తెలుగువారు ఖండాలు దాటినా తమ అభిమాన నాయకుడిని మర్చిపోము అని చెప్పి మరోసారి నిరూపించారు. మహానాయకుడి శత జయంతి సందర్భంగా పసుపు పండుగ మహానాడు 2022 వేదిక చుట్టూ పచ్చని జెండాలతో NTR చిత్రాలతో తెలుగు దేశం కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో మొదటగా తమ అభిమాన నటుడు మహానాయకుడు అన్న నందమూరి తారక రాముడి విగ్రహానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా తెలుగు తల్లి పాట ద్వారా ఉత్తేజితులను చేసి, పార్టీలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ మరణించిన నేతలను స్మరించుకుని మొదటగా సంతాపం తెలియజేశారు. 


మహానాడు 2022 కార్యక్రమంలో వక్తలు ముందుగా మహానాయకుడిని స్మరించుకుంటూ ఆయన పార్టీని స్థాపించిన నాటి విషయాలను స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను పేదలకోసం ప్రవేశపెట్టిన 2 రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాల గురించి మాట్లాడారు. అలాగే మహిళల కోసం దేశంలోనే మొదటి సారి ఆస్తి హక్కును తీసుకొచ్చి ప్రతీ మహిళకు అన్నగా అయ్యారని స్మరించుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఎలా అండగా నిలిచారు అనేది చర్చించుకున్నారు. వేదిక మీద స్వాతి రెడ్డి కనపడగానే అందరు తుగ్లక్ బ్రో డైలాగ్ చెప్పమని అడిగారు. ఏపీలో ఎం ఫేమస్ అని స్వాతి అనగానే అక్కడ ఉన్న పిల్లలు పెద్దలు మీ తుగ్లక్ బ్రో ఫేమస్ అని గట్టిగా అరవడంతో సభలో జోష్ నెలకొంది. అనంతరం స్వాతి రెడ్డి ప్రవాసాంధ్రులని ఉదేశిస్తూ సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకుని పార్టీని బలపరచాలో సందేశం ఇచ్చారు. యువతని ప్రోత్సహిస్తూ ఉత్తేజ పరిచారు. వైసీపీ దుష్ట పరిపాలనను అడ్డుకోవడానికి ప్రవాస ఆంధ్రులు తెలుగు దేశం పార్టీకి ఇంతకు ముందుకంటే 100సార్లు ఎక్కువగా పార్టీని బలోపేతం చేయడం కోసం ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.


2024లో జరగబోయే ఎలెక్షన్స్‌లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటం ఆపొద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో NTR శత జయంతి ఉత్సవాలను రాబోయే 365 రోజులు ఎలా జరుపుకోవాలని, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా ఎలా ఎండగట్టాలి అనే విషయాలను వెల్లడించారు. అలాగే ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి రావటం కోసం ఎలా పని చెయ్యాలి అనే విషయాల మీద చర్చించారు. చివరగా అన్న గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ని కట్ చేశారు. అన్నగారిని స్మరించుకుంటూ వేదిక మొత్తం జై తెలుగుదేశం.. జై NTR.. జోహార్ NTR నినాదాలతో వేదిక దద్దరిల్లి పోయేలా చేశారు. ఈ కార్యక్రమానికి గుంటుపల్లి శ్రీదేవి పాల్గొని జెండా వందనం చేశారు. సుధీర్ కొత్తపల్లి, నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్యామ్ సుందరరావు ఊట్ల, సజ్జ శ్యామ్, రామకృష్ణ నాయుడు, అనిల్ పచ్చ, జగదీశ్ బండారుపల్లి, మురళికృష్ణా ఆరి, శ్రీనివాస్ వళ్లిపల్లి, సాయి కృష్ణ గుర్రం, విజయ్‌కుమార్, రోహిత్ తదితరులు పూర్తి సహాయ సహకారాలు అందించారు.


అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద బాబు, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, పార్టీ సీనియర్ నాయకులు, రాజమండ్రి MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఊరవకొండ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, కిమిడి నాగార్జున ZOOM కాల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని NTRతో వారికి వున్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. నిర్వాహకులను కార్యక్రమం బాగా నిర్వహించారని కితాబిచ్చారు. అలాగే మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి, అలాగే 2024 పార్టీ విజయం కోసం పని చేయ్యాలని కోరారు. 





Updated Date - 2022-05-31T13:29:01+05:30 IST