తెలుగు ప్రజలను మోసం చేస్తున్న పాలకులు
ABN , First Publish Date - 2022-01-22T05:43:09+05:30 IST
తెలుగు ప్రజలను ఇంకా మోసం చేయాలని పాలకులు చూస్తున్నారని కాకినాడ పార్లమెంట్ టీడీపీ మహిళాధ్యక్షురాలు సుంకర పావని విమర్శించారు.
తెలుగు మహిళా కాకినాడ పార్లమెంట్ అధ్యక్షురాలు పావని
కాకినాడ సిటీ, జనవరి 21: తెలుగు ప్రజలను ఇంకా మోసం చేయాలని పాలకులు చూస్తున్నారని కాకినాడ పార్లమెంట్ టీడీపీ మహిళాధ్యక్షురాలు సుంకర పావని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వైసీపీ నవరత్నాలు అని చెపితే ప్రజలు తమ జీవితాలతో పాటు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతారని అనుకున్నారన్నారు. అయితే ప్ర స్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పు అని చెప్పే స్వేచ్ఛ ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు లేకుండా చేశారన్నారు. ఎవరైనా మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి వెన్ను దన్నుగా ఉండే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసపోయారన్నారు.
ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుంది
తుని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి యనమల కృష్ణుడు
తుని, జనవరి 21: సీఎం జగన్ మాటలకు మోసపోయిన ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా టీడీపీ ఉంటుందని తుని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి యనమల కృష్ణుడు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం లో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఉద్యోగులకు, రైతులకు, పేదలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అన్నివర్గాల వారికి నరకం చూపిస్తున్న ఘనత సీఎం జగన్దేనన్నారు. సీఎం జగన్కు పరిపాలన చేతకాక ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పలేక నిరసనలు చేస్తున్న వారిని పోలీసులతో కొట్టించడం, అక్రమంగా కేసులు పెట్టడం చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకులు నిజనిర్ధారణ చేసేందుకు వెళ్తే వారిపై దౌర్జన్యం చేయడం బాధాకరమన్నారు.