20న తెలుగు వర్సిటీ 15వ స్నాతకోత్సవం
ABN , First Publish Date - 2022-06-25T20:30:29+05:30 IST
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని జూలై 20న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేశ్ శుక్రవారం..
హైదరాబాద్, రవీంద్రభారతి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని జూలై 20న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేశ్ శుక్రవారం ప్రకటించారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని ఆయన తెలిపారు.