AP news: తిరుపతిలో తెలుగు యువత వినూత్న నిరసన
ABN , First Publish Date - 2022-07-27T17:11:05+05:30 IST
ఉద్యోగాలు లేక రిక్షా తొక్కే పరిస్థితి ఏర్పడింది సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.
తిరుపతి: ఉద్యోగాలు లేక రిక్షా తొక్కే పరిస్థితి ఏర్పడింది సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) అంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీకున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారని... ఇప్పటికి నాలుగు జనవరిలో వెళ్ళిపోయాయని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు అన్నారు. వెస్ట్ పోలీస్ స్టేషన్లో తెలుగు యువత ఆధ్వర్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. జగన్పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలంటూ రవి నాయుడు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు.