వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్నారైల నిరసన!
ABN , First Publish Date - 2021-10-25T01:16:39+05:30 IST
ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచక పాలన, టీడీపీ కార్యాలయం మీద దాడులు జరిగిన నేపథ్యంలో మెల్బోర్న్లో నివసిస్తున్న ఎన్నారైలు తమ సానుభూతి తెలియచేసారు.
ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచక పాలన, టీడీపీ కార్యాలయం మీద దాడులు జరిగిన నేపథ్యంలో మెల్బోర్న్లో నివసిస్తున్న ఎన్నారైలు తమ సానుభూతి తెలియచేసారు. జగన్ రెడ్డి జనాలని మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాల్సిందే అని తెలుగుదేశం మెల్బోర్న్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు తెలియచేసారు. అలానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరమ్మతుల కోసం తెలుగుదేశం మెల్బోర్న్ తరుపున వారికీ తగిన సహాయం చేస్తాం అని తెలియచేసారు.