పావలా ఇచ్చి ముప్పావలా లాగుతోంది : గోపు

ABN , First Publish Date - 2021-01-25T06:54:41+05:30 IST

పేదలకు ఇచ్చే రేషన్‌ సరుకులు ధరలు పెంచి ప్రభుత్వం రూ.584 కోట్లు భారం మోపడం దారుణమని మచిలీపట్నం నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

పావలా ఇచ్చి ముప్పావలా లాగుతోంది : గోపు

 మచిలీపట్నం టౌన్‌  : పేదలకు ఇచ్చే రేషన్‌ సరుకులు ధరలు పెంచి ప్రభుత్వం రూ.584 కోట్లు భారం మోపడం దారుణమని  మచిలీపట్నం నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.  బందరు పార్లమెంటు నియోజక వర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  గతంలో కిలో పంచదార రూ.20 రూపాయలు ఉండగా ప్రస్తుతం 34 రూపాయలకు పెంచారన్నారు. కందిపప్లు ధర కిలో రూ.20 నుంచి రూ.34లకు పెంచేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం 19 నెలల్లో లక్షన్నర కోట్లు అప్పులు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపతోందని దుయ్య బట్టారు. సంక్షేమం పేరుతో పేదలకు పావలా ఇచ్చి ముప్పా వలా వడ్డిం చడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబతారన్నారు. టీడీపీ నాయకులు బత్తిన దాసు, పివి ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-25T06:54:41+05:30 IST