సంగమేశ్వరాలయ అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-07-27T04:06:56+05:30 IST

సంగమేశ్వరాలయంలో దాతల సహకారంతో చేస్తున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ శ్రీనివాసులురెడ్డి సోమవారం పరిశీలించారు.

సంగమేశ్వరాలయ అభివృద్ధి పనుల పరిశీలన

సంగం, జూలై 26: సంగమేశ్వరాలయంలో దాతల సహకారంతో చేస్తున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ శ్రీనివాసులురెడ్డి సోమవారం పరిశీలించారు. ఆలయం ప్రాంగణం ఎత్తిలేపి కాంక్రీట్‌ పనులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రాంగణంలో శిథిలస్థితిలో ఉన్న విడిది మండపం ఎత్తి పెంచి యథావిధిగా నిర్మాణం చేపట్టేందుకు గ్రామపెద్దలు కోరడంతో అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ఆదాయం పెరిగితే రెండవ పూజారిని నియమించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. లేకపోతే దాత లు ముందుకు వస్తే నియమాకానికి అవకాశం ఇస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్థులు చేస్తున్న కృషికి అభినందనీయమన్నారు. జిల్లాలో ఏ కేటగిరి కింద 21 ఆలయాలు, బీ కేటగిరిలో 56, సీ కేటగిరిలో 251 ఆలయాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దేవాదాయశాఖ సప్పతి సురేంద్ర, ఈవో ప్రసాదు, ఆలయ పూజారి గోపాలకృష్ణ, గ్రామ పెద్దలు కోటు కరుణాకర్‌రెడ్డి, వేమా మల్లిఖార్జునరావు, గ్రంధి గోపికృష్ణ, రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:06:56+05:30 IST