వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2020-12-04T04:52:00+05:30 IST
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
కొడంగల్: కొడంగల్ పట్టణంలోని వడ్డెరగల్లీలోని చితారు పెరుమాళ్ల ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం వైభ వంగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయ నిర్మాణంతో పాటు ఆలయాన్ని అలంకరించి శిఖరంతో పాటు విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.