అయోధ్య రామమందిరానికి విరాళాల సేకరణ

ABN , First Publish Date - 2021-01-24T04:50:04+05:30 IST

అయోధ్యలో రామమంది రం నిర్మాణానికి జిల్లా కేంద్రం నుంచి శనివారం పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు.

అయోధ్య రామమందిరానికి విరాళాల సేకరణ
లక్ష రూపాయల విరాళం చెక్కును అందిస్తున్న భద్రాద్రి బ్యాంక్‌ చైర్మన్‌ కృష్ణమూర్తి

ఖమ్మం మయూరిసెంటర్‌, జనవరి 23: అయోధ్యలో రామమంది రం నిర్మాణానికి జిల్లా కేంద్రం నుంచి శనివారం పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. బీజేపీ కోర్‌ కమిటి సభ్యులు తమిళనాడు బీజేపీ సహ ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు లక్ష నూట పదహరు రూపాయల చెక్కును ఖానాపూరం లో గల అభయ వెంకటేశ్వర స్వామి అల యంలో జిల్లా తీర్థట్రస్టు కన్వీనర్‌ అల్లిక అంజయ్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌స్‌ తెలంగాణ ప్రాంత సంపర్క్‌ రామ్మూర్తి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నున్నా రవి, రాజేశ్వరశాస్త్రీ, రామలింగేశ్వరరావు, శ్రీదేవి, సరస్వతి, పద్మ, విజయరెడ్డి, తదితరులు ఉన్నారు. 


భద్రాద్రి బ్యాంకు చైర్మన్‌ విరాళం..


రామ మందిర నిర్మాణానికి భద్రాద్రి బ్యాంకు చైర్మన్‌ చేరుకూరి కృష్ణమూర్తి, బ్యాంకు సీఈవో సాంబమూర్తి కలిసి రూ.లక్ష విరాళం ఇవ్వగా, కన్యాకపరమేశ్వరి దేవాలయం కమిటీ, అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరా వు, సెక్రెటరి దేవత అనిల్‌, కోశాధికారి హేమసుందర్‌ కలిసి రూ.లక్ష అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ్‌ ప్రతాప్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ కటేపల్లి లక్ష్మినారాయణ, తీర్థ ట్రస్టు కన్వీనర్‌ అల్లిక అంజయ్య తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-01-24T04:50:04+05:30 IST