జమ్మూలో ఆలయం ధ్వంసం
ABN , First Publish Date - 2022-04-10T00:26:38+05:30 IST
జమ్మూలోని ఓ హిందూ ఆలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగలు ధ్వంసం..
శ్రీనగర్: జమ్మూలోని ఓ హిందూ ఆలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. సిటీ శివార్లలోని సిధ్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. దశాబ్దాల క్రితం నాటి ఈ ఆలయంలోని విగ్రహాలను దుండగలు ధ్వంసం చేసినట్టు అధికారులు చెప్పారు.
ఆలయ పూజారాలు ఉదయం ఆలయానికి చేరుకోగానే విగ్రహాల విధ్వంసం జరిగినట్టు గుర్తించారని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని, శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము మధ్యలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోందని అధికారులు చెప్పారు. కాగా, దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలని, శాంతికి భంగం కలిగించేందుకు ప్రయత్నించే విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.