అన్నదాన పఽథకానికి రూ. లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-04-23T05:20:27+05:30 IST
మహానంది క్షేత్రంలో అన్నదాన పఽథకానికి హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కె.సారంగాధర, సుభద్రమ్మ దంపతులు రూ. లక్ష విరాళాన్ని అందించినట్లు ఆలయ సూపరింటెండెంట్ ఓంకారం వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు.
మహానంది, ఏప్రిల్ 22: మహానంది క్షేత్రంలో అన్నదాన పఽథకానికి హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కె.సారంగాధర, సుభద్రమ్మ దంపతులు రూ. లక్ష విరాళాన్ని అందించినట్లు ఆలయ సూపరింటెండెంట్ ఓంకారం వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. దేవస్థానం అకౌంట్కు దాతలు హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ద్వారా రూ.లక్ష విరాళాన్ని అన్నదాన పఽథకానికి పంపినట్లు చెప్పారు.