రామనామస్మరణతో మార్మోగిన ఆలయాలు

ABN , First Publish Date - 2022-05-26T05:57:34+05:30 IST

జిల్లావ్యాప్తంగా బుధవారం హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాలు రామనామ స్మరణతో మార్మోగాయి.

రామనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
మడకశిర మండలం చందకచర్లలో జ్యోతులతో మహిళల ఊరేగింపు

మడకశిర టౌన, మే 25: జిల్లావ్యాప్తంగా బుధవారం హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాలు రామనామ స్మరణతో మార్మోగాయి. ఉ దయం నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, పూజ లు కొనసాగాయి. భక్తజన కోలాహలం నడుమ పండుగ వాతావరణం నెలకుంది. మడకశిర పట్టణంలోని మెట్టబం డ ఆంజనేయస్వామి, మారుతీనగర్‌ అభయాంజనేయస్వా మి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వందలాది మంది మహిళలు జ్యోతులతో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవ విగ్రహన్ని ఉరేగించారు. పలు ఆలయాల్లో రంగురంగు పూ లు, తమలపాకులతో అలంకరణ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.


మడకశిర రూరల్‌: మండలంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయస్వామి బ్రహ్మరఽథోత్సవం వైభంగా జరిగిం ది. ఉదయం స్వామివారికి హోమాలు చేశారు. ఆంధ్ర క ర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు జ్యోతులతో ఊరేగింపుగా వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కు లు తీర్చుకున్నారు.  ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, వైటీ ప్ర భాకర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.నీలకంఠాపురంలో   మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్వామివారి ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు.


రొద్దం: స్థానిక పెద్ద ఆంజనేయస్వామి ఆలయంలో ప్ర త్యేక అలంకరణలు, పూజలు చేశారు. సీతారామ విగ్రహాల ను ఊరేగించి, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు.  భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి మా లధారుల ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. 


లేపాక్షి: మండలంలోని అన్ని హనుమంతుని ఆలయా లు రామనామంతో మార్మోగాయి. పులమతిలో స్వామివారి మూలవిరాట్‌నుప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు. 


గోరంట్ల: స్థానిక మరువ ఆంజనేయస్వామి, రామాల యం, బూదిలి కాడిమాను ఆంజనేయస్వామి, కొండాపురం ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో జయంతి వేడుకలు అంబరాన్నంటాయి.


ఆగళి: మండలంలోని రావుడి, కోడిపల్లి, అగళి, హెచడీహళ్లిలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ఆకుపూజ, ప్రత్యేక అలంకరణ, హోమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి.


చిలమత్తూరు: స్థానిక ఊరువాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి మూలవిరాట్‌కు విశేష పుష్పాలంకరణ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తు న స్వామి వారిని దర్శించుకున్నారు. 


పెనుకొండ రూరల్‌: మండల వ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి వేడుకలను జరుపుకున్నారు. న గర పంచాయతీ ఇస్లాపురంలో ఆంజనేయ చిత్రపటానికి పూజలు చేసి పురవీధుల్లో ఊరేగించారు. 


పెనుకొండ: శ్రీరామ హనుమాన సేవా సమితి ఆధ్వర్యంలో ఊరువాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకు లు బాబు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 


Updated Date - 2022-05-26T05:57:34+05:30 IST