Udayanidhi Stalin: దేవాలయాల్లో సహపంక్తి భోజనాలు

ABN , First Publish Date - 2022-08-16T16:44:36+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని 33 ప్రధాన ఆలయాల్లో సోమవారం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.

Udayanidhi Stalin: దేవాలయాల్లో సహపంక్తి భోజనాలు

                                           - పాల్గొన్న మంత్రులు  


అడయార్‌(చెన్నై), ఆగస్టు 15: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని 33 ప్రధాన ఆలయాల్లో సోమవారం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. తిరువేర్కాడు దేవి కరుమారియమ్మన్‌ ఆలయంలో మంత్రి నాజర్‌, తిరువళ్లికేణి పార్థసారథి ఆలయంలో మంత్రి పీకే శేఖర్‌బాబు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌(Udayanidhi Stalin), వడపళని ఆండవర్‌ ఆలయంలో తంగం తెన్నరసు, మైలాపూర్‌ కపాళీశ్వర ఆలయంలో ఇ.పెరియస్వామి, మాంగాడు కామాక్షి అమ్మన్‌ ఆలయంలో మంత్రి రాజా కన్నప్పన్‌, తిరువొట్రియూరు త్యాగరాజస్వామి ఆయలంలో మంత్రి అనితా రాధాకృష్ణన్‌, ప్యారీస్‌ కాళికామాత ఆలయంలో మంత్రి కేఆర్‌ పెరియకరుప్పన్‌, మైలాపూర్‌(Mylapore) ముండకన్నియమ్మన్‌ ఆలయంలో మంత్రి రామచంద్రన్‌, రాయపేట సిద్ధి వినాయకర్‌ ఆలయంలో మంత్రి ఆర్‌.గాంధీ పాల్గొన్నారు. ఇదే విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధి ఆలయాల్లో జరిగిన సహపంక్తి భోజనాల్లో పలువురు మంత్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T16:44:36+05:30 IST