రంగడి హుండీ ఆదాయం రూ.16.71 లక్షలు
ABN , First Publish Date - 2022-01-25T04:38:52+05:30 IST
నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు జరిగింది. 2021 అక్టోబరు 8వ తేదీ నుంచి 2022 జనవరి 24వ తేదీ వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కించగా 13,10,376 రూపాయలు వచ్చాయి.
నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 24: నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు జరిగింది. 2021 అక్టోబరు 8వ తేదీ నుంచి 2022 జనవరి 24వ తేదీ వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కించగా 13,10,376 రూపాయలు వచ్చాయి. 2022 జనవరి 1 నుంచి వైకుంఠ ఏకాదశి, పగల్ పత్తు, రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలు లెక్కించగా 3,67,161 రూపాయలు వచ్చాయి. మొత్తం 16,71,537 రూపాయలు వచ్చాయి. గత సంవత్సరం ఇదే రోజుల్లో వచ్చిన ఆదాయం కంటే ఈ సంవత్సరం 1,26,123 రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందని ఈవో డీ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఆర్కే చైతన్య, చైర్మన్ ఇలపాక శివకుమార్ఆచారి, ధర్మకర్తల మండలి సభ్యులు మిరియాల శిగామి, టీవీ. నరశింహాచార్యులు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.