పది జిల్లాల్లో Covid కేసులు జీరో
ABN , First Publish Date - 2021-10-23T14:49:22+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 378 మం దికి పాజిటివ్ నిర్దారణ అయింది. 10 జిల్లాల్లో జీరో నమోదు కాగా మరో పది జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరులో 195 మంది, దక్షిణ కన్నడలో 24 మంది,
బెంగళూరు(Karnataka): రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 378 మం దికి పాజిటివ్ నిర్దారణ అయింది. 10 జిల్లాల్లో జీరో నమోదు కాగా మరో పది జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరులో 195 మంది, దక్షిణ కన్నడలో 24 మంది, తుమకూరు, మైసూరులలో 23 మంది, హాసన్లో 21 మందికి వైరస్ నిర్దారణ కాగా ఐదు జిల్లాఓ్ల 20లోపు బాధితులు నమోదయ్యారు. 464 మంది కోలుకోగా 11 మంది మృతిచెందారు. వీరిలో బెంగళూరు లో ఏడుగురు కాగా మరో నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 25 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. 30 జిల్లాల్లో 8891 మంది చికిత్సలు పొందుతున్నారు.