పది జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2022-03-08T16:58:54+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత గా తగ్గింది. సోమవారం 155 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాజధాని బెంగళూరులో 97, మైసూరులో 14 కేసులు నమోదయ్యాయి. ఇతర

పది జిల్లాల్లో Covid కేసులు నిల్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం మరింత గా తగ్గింది. సోమవారం 155 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాజధాని బెంగళూరులో 97, మైసూరులో 14 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 349 మంది కోలుకోగా ఐదుగురు మృతిచెందారు. బెంగళూరులో ముగ్గురు, బెళగావిలో ఒకరు, మండ్యలో ఒకరు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,049 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 2,350 మంది ఉన్నారు. 

Updated Date - 2022-03-08T16:58:54+05:30 IST