అంతులేని నిర్లక్ష్యం వల్లే పదిమంది మృతి
ABN , First Publish Date - 2021-05-11T04:48:45+05:30 IST
మామిళ్లపల్లె ప్రమాదంలో గని యజమానులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే పది మంది బలయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి చం ద్రశేఖర్ ఆరోపించారు
బద్వేలు, మే 10: మామిళ్లపల్లె ప్రమాదంలో గని యజమానులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే పది మంది బలయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి చం ద్రశేఖర్ ఆరోపించారు. మైనింగ్లో వెలుగుచూసిన మోసాలకు కారణమైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారి ఆస్తులను వెంటనే అమ్ముకోకుండా ప్రభుత్వం నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ప్రతి కార్మిక కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జిచేత సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.