ఆదిలాబాద్ జిల్లాలో ఉర్సు ఉత్సవాల్లో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-10-27T21:42:17+05:30 IST
జిల్లాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో
ఆదిలాబాద్: జిల్లాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇచ్చోడ మండలంలోని గుండాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. డీజే విషయంలో వివాదం తలెత్తింది. పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గుండాలలో భారీగా పోలీసులు మోహరించారు.