తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-04-17T00:01:47+05:30 IST
తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద ఉద్రిక్తత
మెదక్: కామారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పద్మ, సంతోష్ మృతదేహాలతో బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనలో ఇప్పటికే ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రోహిణి తెలిపారు. ఏడుగురిని అరెస్ట్ చేసి డీఎస్పీ పైఅధికారితో విచారణ జరిపిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సంతోష్ కుటుంబీకులతో ఎస్పీ రోహిణి చర్చలు జరిపారు. మృతదేహాల తరలింపునకు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారని ఎస్పీ వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ను అరెస్ట్ చేయాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలను పోలీసులు బలవంతంగా అంత్యక్రియలకు తరలించారు.