AP News: ఉంగుటూరు పీఎస్ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-09-16T21:09:00+05:30 IST
జిల్లాలోని ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. అక్రమ కేసులు వెంటనే నిలిపివేయాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను విడుదల చేయాలంటూ పోలీస్స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.