కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-23T02:33:55+05:30 IST

జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్తత

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్లందకుంట మండలంలోని సిరిసెడు గ్రామంలో కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్ షోలోబీజేపి, టీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు తారస పడ్డారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై ఈటెల అంటూ పోటా పోటీ నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. ఇరువర్గాలను  అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇరువర్గాలకు స్వల్ప గాయాలు అయ్యాయి. పావు గంట పాటు రోడ్డు మార్గం స్తంభించింది. ఎట్టకేలకు ఇరువర్గాలను పోలీసులు శాంతింప చేసారు. పలువురిపై పోలీసులు చేయి చేసుకున్నారు.  

Updated Date - 2021-10-23T02:33:55+05:30 IST