Mahabubabad: ఇనుగుర్తిని మండలంగా చేయాలంటూ ఆందోళన

ABN , First Publish Date - 2022-07-24T18:06:47+05:30 IST

ఇనుగుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. మండల కోసం చేస్తున్న పోరాటం ఉధృతం అయింది.

Mahabubabad: ఇనుగుర్తిని మండలంగా చేయాలంటూ ఆందోళన

మహబూబాబాద్ (Mahabubabad): ఇనుగుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. మండలం కోసం చేస్తున్న పోరాటం ఉధృతం అయింది. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ధర్నా (Dharna), రాస్తారోకో (Rastaroko) చేస్తున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోడ్డుకు అడ్డంగా కంప చెట్లను వేసి నిరసన చేపట్టారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తక్కువ జనాభా కలిగిన సిరోల్‌ను మండలంగా ప్రకటించి, పదివేల జనాభా కలిగిన ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-24T18:06:47+05:30 IST