కృష్ణా జిల్లా సోమవరంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-08T01:40:13+05:30 IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మచిలీపట్నంలో ఇటీవల ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న

కృష్ణా జిల్లా సోమవరంలో ఉద్రిక్తత

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మచిలీపట్నంలో ఇటీవల ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జిల్లేపల్లి ప్రశాంతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యపై తల్లిదండ్రులు గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రశాంతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించడానికి  సోమవరం గ్రామం రావడంతో బంధువులు, గ్రామస్తులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యువకులను గ్రామస్తులు నిర్బంధించారు. పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2021-11-08T01:40:13+05:30 IST