AP News... విజ‌య‌వాడ‌: పామ‌ర్రులో కొనసాగుతున్న ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-11T19:55:11+05:30 IST

పామ‌ర్రులో ఉద్రిక్తత కొనసాగుతోంది. గుడివాడ వెళుతున్న టీడీపీ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు

AP News... విజ‌య‌వాడ‌: పామ‌ర్రులో కొనసాగుతున్న ఉద్రిక్తత

విజ‌య‌వాడ (Vijayawada)‌: పామ‌ర్రు (Pamarru)లో ఉద్రిక్తత (Tension) కొనసాగుతోంది. గుడివాడ వెళుతున్న టీడీపీ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మీడియాపై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆంక్ష‌లు విధించారు. క‌నీస మాన‌వ‌త్వాన్ని మ‌ర్చిపోయి ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏ ఒక్క‌రినీ గుడివాడ వెళ్ల‌నివ్వ‌కుండా చూడాలంటూ పోలీసుల‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు ర‌వీంద్ర, బ‌చ్చుల అర్జునుడుల‌ను అరెస్ట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే వారు కారులో నుంచి బ‌య‌ట‌కు దిగేందుకు నిరాక‌రిస్తున్నారు. కారు చుట్టూ పోలీసులు వ‌ల‌యంగా ఏర్పడ్డారు. కారు డోర్ లాక్ చేసుకుని లోపలే కూర్చొన్న నేతలను ఎలా బయటకు తేవాలో తెలియక పోలీసులుసతమతం అవుతున్నారు. కారు లాక్‌ను ఓపెన్ చేసే క్ర‌మంలో చుట్టుప‌క్క‌ల వారిని పోలీసులు త‌ర‌మేస్తున్నారు. కారు డోర్ బీడింగ్ తీసి కారు ఓపెన్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. 


కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu), లోకేష్‌ (Lokesh)లపై కొడాలి నాని (Kodali Nani) చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు గుడివాడ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసేందుకు వెళ్తున్న క్రమంలో టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ.. అదుపులోకి తీసుకుంటున్నారు. గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతున్నారు.

Updated Date - 2022-09-11T19:55:11+05:30 IST