జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-07-28T02:55:47+05:30 IST

దేవినేని ఉమపై జరిగిన దాడి నేపథ్యంలో జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితి

జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత

కృష్ణా: దేవినేని ఉమపై జరిగిన దాడి నేపథ్యంలో జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్‌స్టేషన్‌ దగ్గర టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దేవినేని ఉమపై దాడి సమయంలో తమను అకారణంగా దూషించి దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌ దగ్గరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.  

Updated Date - 2021-07-28T02:55:47+05:30 IST